ETV Bharat / entertainment

NTR 30 గూస్​ బంప్స్​ అప్డేట్​​​.. ఇండియాలోనే తొలిసారిగా అలా!

author img

By

Published : Feb 7, 2023, 4:46 PM IST

NTR 30 గురించి గూస్​బంప్స్​ తెప్పించేలా ఓ వార్త ప్రచారం సాగుతోంది. భారీ బీచ్​ ఫైట్​ సీక్వెన్స్​ తెరకెక్కిస్తున్నారట. ఆ వివరాలు..

NTR 30 movie beach fight update
NTR 30.. భారీగా బీచ్​ ఫైట్​ సీక్వెన్స్​.. ఇండియాలోనే తొలిసారిగా!

యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కబోతున్న కొత్త సినిమా 'ఎన్టీఆర్​ 30'. జనతా గ్యారేజ్‌ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్​గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రకటించాక.. కొరటాల శివ, ఎన్టీఆర్‌ సైలెంట్‌గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్‌డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్‌పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు ఫ్యాన్స్​ను నిరాశపరిచాయి. అప్పటి నుంచి అభిమానులు అప్డేట్స్​ అంటూ సోషల్​మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెలలలోనే షూటింగ్​ ప్రారంభించుకోనుందంటూ.. ఎన్టీఆర్... ​ ఫ్యాన్స్​పై సీరియస్​ అయ్యారు. దీంతో అభిమానుల్లో ఫుల్​ జోష్​ మొదలైంది. ఇప్పుడా జోష్​ను మరింత రెట్టింపు అయ్యేలా.. మరో వార్త బయటకు వచ్చింది.

అదేంటంటే.. ఈ సినిమా కోసం శంషాబాద్‌లో ఒక సెట్, గోవాలో మరో సెట్ వేస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. మొదటి షెడ్యూల్ ఇక్కడ, రెండోది అక్కడ ప్లాన్ చేస్తున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం.. గోవాలో జరిగే షెడ్యూల్‌లో.. బీచ్​ సెటప్​ వేసి ఓ హెవీ యాక్షన్​ సీక్వెన్స్​ను రూపొందించనున్నారట. ఈ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌.. చిత్రానికే మెయిన్​ హైలైట్​గా నిలవనుందట. ఇది ఇండియాలో ఏ సినిమాలోనూ చూపించని విధంగా డిజైన్ చేశారని తెలిసింది. ఇది చూసినప్పుడు ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. సినిమాలో ఈ బీచ్ యాక్షన్​ సీక్వెన్స్​ చిత్రానికి కీలకం కానుందట. కథలో ఇక్కడి సన్నివేశాలే ముఖ్యమట. ​ఇందుకోసం భారీ సెటప్​ వేయబోతున్నారని తెలుస్తోంది.

మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా పూర్వ నిర్మాణ పనుల్ని పూర్తి చేసుుకున్న ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్‌ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో రూపొందనుందని మొదటి నుంచి మూవీటీమ్​ చెబుతూనే వస్తోంది. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో​ హీరోయిన్​గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదీ చూడండి: అందాల నిధి.. ఏ తోటలో పండిన పండో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.