ETV Bharat / entertainment

'ఆదిపురుష్​ తీసింది వారి కోసం కాదు!'.. ట్రోల్స్​పై దర్శకుడి కౌంటర్

author img

By

Published : Oct 5, 2022, 8:41 AM IST

director om raut racts on adipurush trolls
adipurush

తాజాగా విడుదలైన 'ఆదిపురుష్'​ టీజర్​పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్​ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో దర్శకుడు ఓం రౌత్​ విమర్శలకు సమాధానం ఇచ్చారు.

రాముడి పాత్రలో ఓం రౌత్‌ రూపొందిస్తున్న మైథలాజికల్‌ మూవీ 'ఆది పురుష్‌'. కృతిసనన్‌ సీతగా, సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేష్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌పై సినీ అభిమానులతో పాటు, విమర్శకులు సైతం పెదవి విరిచారు. సోషల్‌మీడియాలో అయితే, విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో టీజర్‌ని 3డీలో స్క్రీనింగ్‌ వేశారు. దీనిని చూసిన వారందరూ యూట్యూబ్‌లో విడుదలైన టీజర్‌ను 3డీలో చూస్తుంటే అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. విజువల్‌ వండర్‌గా ఓం రౌత్‌దీన్ని తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సోషల్‌మీడియాలో ట్రోల్‌పై దర్శకుడు ఓం రౌత్‌ కూడా స్పందించారు.

"ఆది పురుష్‌ టీజర్‌ విడుదలైన తర్వాత వస్తున్న ట్రోలింగ్‌ చూసి నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం. అయితే, ట్రోలింగ్‌ వల్ల నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా వెండితెర కోసం తీశాం. థియేటర్‌లో తెరసైజు తగ్గచ్చేమో కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. అలా చేస్తే, అస్సలు బాగోదు. నాకు అవకాశం ఇస్తే, యూట్యూబ్‌లో పెట్టకుండా చేయొచ్చు. నాకు అది కేవలం ఓ గంట పని. కానీ, అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనూ యూట్యూబ్‌ ఆడియెన్స్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం" అని అన్నారు.

"నా భాగస్వాములు, స్టూడియో(టీ-సిరీస్‌) ప్రపంచంలోనే అతి పెద్ద యూట్యూబ్‌ ఛానెల్‌. చాలా అరుదుగా సినిమా చూసే వాళ్ల కోసం దీన్ని తీయలేదు. థియేటర్‌కు దూరమైన పెద్దవాళ్లు, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్లను సినిమా థియేటర్‌కు రప్పించే ఉద్దేశంతో తీశాం. ఎందుకంటే ఇది రామాయణం. గ్లోబల్‌ కంటెంట్‌ కోరుకుంటున్న తర్వాతి జనరేషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నాం. వారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేము ఈ మార్గాన్ని(3డీ మోషన్‌ క్యాప్చర్‌)ను ఎంచుకున్నాం" అని ఓం రౌత్‌ చెప్పుకొచ్చారు. చిన్న తెరలపై చూడటానికి మాత్రం 'ఆది పురుష్‌' తీయలేదని పెద్ద తెరపై చూస్తేనే తాము తీసే కంటెంట్‌ విలువ తెలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. 'ఆది పురుష్‌' వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై వస్తున్న ట్రోల్స్‌ నేపథ్యంలో ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్‌ను మరింత మెరుగు పర్చేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి: 'ది ఘోస్ట్'తో నెరవేరిన నాగార్జున కల!

రీమేక్‌ అంటే చులకన ఎందుకు?: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.