ETV Bharat / entertainment

బాలయ్యతో మల్టీస్టారర్​.. షోకు త్రివిక్రమ్​ మిస్​.. పవన్​ ఆన్సర్ ఇదే!

author img

By

Published : Feb 10, 2023, 12:40 PM IST

Pawan kalyan unstoppable
అందుకే పవన్​ అన్​స్టాపబుల్​కు త్రివిక్రమ్​ ఎస్కేప్​.. క్రిష్ క్లారిటీ!

బాలయ్య-పవన్​కల్యామ్​ అన్​స్టాపబుల్​ ఎపిసోడ్​కు దర్శకుడు త్రివిక్రమ్​ ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చారు మరో డైరెక్టర్ క్రిష్​. ఇంకా ఈ షోలో బాలయ్యతో మల్టీస్టారర్​ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్​ చెప్పుకొచ్చారు. ఆ సంగతులు..

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్​కు పవర్​స్టార్​ పవన్ కళ్యాణ్ గెస్ట్​గా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన తొలి పార్ట్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న రెండో పార్ట్ కూడా అదే తరహాలో ఫుల్​ క్రేజ్ అందుకుంటోంది. అయితే ఈ ఎపిసోడ్​కు త్రివిక్రమ్​ను రావాలని బాలయ్య ముందుగానే కోరగా.. ఆయన వస్తాను అని చెప్పి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వారిద్దరిని కలిపి సెకండ్ పార్ట్ ఎపిసోడ్​లో హైలెట్ చేయాలని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్​ చివరి నిమిషంలో రాకపోవడంతో.. ఆయన ఎందుకు రాలేదో.. ఈ షోలో సందడి చేసిన క్రిష్​ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

క్రిష్ ఈ ఎపిసోడ్​లోకి ఎంట్రీ ఇవ్వగానే... బాలయ్య 'మా ఇద్దరితో సినిమాలు చేశావు కదా ఇప్పుడు ఎలా ఉంది' అని అడిగారు. 'ఒక పులి, సింహం మధ్యలో నా తల ఉంది' అంటూ క్రిష్ భయపడుతూ(సరదాగా) సమాధానం ఇచ్చాడు. "అయితే షూటింగ్​లో డైరెక్షన్ చేసినప్పుడు భయం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇలా కూర్చున్నందుకు మాత్రం కాస్త భయంగా ఉంది. త్రివిక్రమ్ గారు ఎందుకు రాలేదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విధంగా ఇద్దరు నన్ను ర్యాగింగ్ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. త్రివిక్రమ్ గారు చాలా తెలివిగా తప్పించుకున్నారు" అని చెప్పకనే చెప్పేశారు.

ఇక ఈ వేదికపై రాజకీయపరమైన సంభాషణ ఎక్కువగా జరిగినప్పటికీ.. 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించిన టాపిక్ కూడా వచ్చింది. ఆ సమయంలో డైరెక్టర్ క్రిష్.. ఓ సందర్భంలో బాలయ్యలాగే పవన్ కూడా సినిమాలో తొడగొడతాడని చెప్పగా.. బాలయ్య సంబరపడిపోయారు. ఇక 'ఎస్ - నో' అనే క్వశ్చన్​ రౌండ్​ కూడా సరదాగా గడిచింది. 'నాతో మల్టీ స్టారర్ చేయాలని ఉందా?' అని బాలయ్య అడగగా.. పవన్ 'ఎస్' అంటూ పలకపై రాసి చూపించడంతో ఆడిటోరియం అంతా ఈలలతో మోగిపోయింది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు.. సారీ చెప్పే సందర్భాన్ని గురించి బాలయ్య అడగగా.. గొడవలు రాకుండా చూసుకుంటాను, దీంతో సారీ చెప్పాల్సిన అవసరం ఉండదంటూ పవన్ టక్కున నవ్వేశారు.

చివర్లో పవన్ మాట్లాడుతూ .. 'బాలకృష్ణగారు మంచి మనసున్న మనిషి. ఒక దశలో ఆయన సినిమాలు ఆడలేదు. ఆ సమయంలో మా ఫ్యామిలీలోని అందరం కూడా ఆయన సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాం. మా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది' అని అన్నారు. ఓ వైపు ప్రజాసేవ చేస్తూనే మరో వైపు సినిమాలు చేయాలని బాలయ్య చెబుతూ పవన్ భుజం తట్టడంతో ఈ ఎపిసోడ్​తో పాటు రెండో సీజన్ కూడా ముగిసింది.

ఇదీ చూడండి: ఆ సంఘటన వల్ల చిరు రోజంతా భయపడుతూనే ఉన్నారట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.