ETV Bharat / entertainment

చిరుకు విలన్​గా మలయాళ నటుడు!.. 'ప్రాజెక్ట్​ కె' టీమ్​కు ప్రభాస్​ స్పెషల్​ పార్టీ​

author img

By

Published : Jun 26, 2022, 4:43 PM IST

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్యలో ప్రతినాయకుడిగా ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్​ నటిస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు హీరో ప్రభాస్​.. ప్రాజెక్ట్​ కె మూవీటీమ్​కు స్పెషల్​ పార్టీ ఇచ్చినట్లు ఓ వీడియో సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్​, దుల్కర్​ సల్మాన్​, నాగ్​ అశ్విన్​ సహా తదితురులు పాల్గొన్నారు.

Mega 154
ప్రాజెక్ట్​ కె మెగా 154

Chiru 154 Biju menon: మెగాస్టార్​ చిరంజీవి-దర్శకుడు బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్‌ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ మూవీలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. రవితేజ, బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్​ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. సముద్రఖని, విజయ్​సేతుపతి ప్రతినాయకుడిగా కనిపిస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్​ను తీసుకోవాలని మూవీటీమ్​ భావిస్తోందట. ​తెలుగులో బిజూ.. 'ఖతర్నాక్', 'రణం' సినిమాలు చేశారు. టాలీవుడ్​లో ఈయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మాలీవుడ్​లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 'అయ్యప్పన్ కోషియమ్'​ సినిమాతో బిజూ రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన్ను మళ్లీ టాలీవుడ్​కు తీసుకురావాలని 'మెగా 154' టీమ్​ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రానుంది.

Prabhas Project K Party: పాన్​ఇండియా ప్రభాస్​.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్​లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన 'ప్రాజెక్ట్​ కె' మూవీటీమ్​కు ఓ స్పెషల్​ పార్టీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పార్టీలో అమితాబ్​ బచ్చన్​, దర్శకుడు నాగ్​ అశ్విన్​తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్​ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్​గా మారింది. సైంటిఫిక్ థ్రిల్లర్​ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేమ్​ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోంది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రభాస్​ ఈ సినిమాతో పాటు.. 'సలార్'​, 'ఆదిపురుష్'​లతో త్వరలోనే అభిమానుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: 'ఏం మిస్‌ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది'.. హీరో గోపీచంద్‌ భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.