ETV Bharat / crime

మూడేళ్ల ప్రేమ... పెళ్లనగానే ముఖం చాటేసిన ప్రజా ప్రతినిధి

author img

By

Published : May 10, 2021, 10:10 AM IST

ఆయనో ప్రజా ప్రతినిధి.. ఓ అమ్మాయిని ప్రేమించాడు.. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామనగానే.. ముఖం చాటేశాడు. దీనితో ఆ అమ్మాయి... చేసేదేమి లేక ఆదివారం రాత్రి ప్రజాప్రతినిధి ఇంటిమందు బైఠాయించి.. నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కదంబపూర్​ గ్రామంలో చోటుచేసుకుంది.

young woman protest in front of lover's house
ప్రేమించాడు.. పెళ్లి అనగానే పరార్​

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం కదంబపూర్​ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్​ కోట సుమంత్​... అదే గ్రామానికి చెందిన ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమించాడు. ఆ యువతి పెళ్లి చేసుకుందామనగానే ముఖం చాటేశాడు. ఆ యువతి ఆదివారం రాత్రి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి... నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు వచ్చి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో... బాధితురాలు ఆందోళన విరమించింది. బాధితురాలికి మహిళా సంఘాలు, సఖి కేంద్రం నిర్వాహకులు అండగా నిలిచారు.

ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.