ETV Bharat / crime

KIDNAP: ప్రేమ పేరుతో నయవంచన.. నిలదీసినందుకు ప్రియురాలు కిడ్నాప్!

author img

By

Published : Jul 7, 2021, 7:50 PM IST

lover kidnap
ప్రియురాలి కిడ్నాప్​

ప్రేమించాడు. జీవితాన్ని పంచుకుంటానని మాటిచ్చాడు. కరోనాతో దొరికిన గ్యాప్​ను వాడుకుని.. ఎస్కేప్ అయ్యాడు. సొంతూరుకు చేరుకుని.. హాయిగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన అతడి ప్రేమికురాలు.. భరించలేకపోయింది. అతని ఊరికి వెళ్లింది. ఎందుకిలా చేశావని నిలదీసింది. అతడిని వదిలి ఉండలేనని తేల్చి చెప్పింది. ఆ సమయంలో.. ఆమె ప్రేమికుడి అసలు స్వరూపం మరోసారి బయటపడింది. అక్కడికక్కడే యువతిని నిర్బంధించిన సదరు ఫేక్ ప్రేమికుడు.. డ్రామా చేశాడు. చివరికి.. విషయం బట్టబయలై.. పోలీసు కేసులో ఇరుక్కున్నాడు.

ప్రేమించిన యువతిని మోసం చేయడమే కాకుండా.. ఆమెను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా నవుడూరులో జరిగింది.

ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది!

బెంగళూరు టు వెస్ట్ గోదావరి. అక్కడ మొదలైన ప్రేమకథ.. చివరికి గోదారి గట్టున మోసపూరితమని తేలిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన రమేశ్​.. కర్ణాటక రాజధాని బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసేవాడు. అక్కడే ఓ యువతిని ప్రేమించాడు. కరోనా వ్యాప్తితో బెంగళూరులో ఉండలేని పరిస్థితుల్లో.. తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం.. ఏం జరిగిందో కానీ.. తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రమేశ్​ వ్యవహారం.. బెంగళూరులో ఉన్న ప్రేమికురాలికి తెలిసింది. అక్కడి నుంచి ఈ నెల 4న ప్రియుడి ఇంటిని వెతుక్కుంటూ.. నవుడూరుకు చేరింది. తనను మోసం చేసినందుకు రమేశ్​తో పాటు.. అతని తల్లిదండ్రులనూ నిలదీసింది.

రాజీ యత్నం విఫలమై... కిడ్నాప్!

తన ప్రేమికురాలు ఇంత పట్టుబడుతుందని ఊహించని రమేశ్​.. చివరికి ఆమెను నిర్బంధించాడు. ఆ నోటా ఈ నోటా.. ఈ విషయం బయటకు వచ్చింది. స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న రమేశ్​.. తన స్నేహితుడి సహాయం తీసుకుని.. ఆ అమ్మాయిని మరో ప్రాంతానికి తరలించాడు. అక్కడి నుంచి ఆమెను బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు. మానసికంగా హింసించాడు. బెదిరించాడు. తాను బెంగళూరు వెళ్లిపోయినట్టుగా.. ఆ అమ్మాయితోనే ఫోన్లో పోలీసులకు చెప్పించి.. వారిని తప్పుదోవ పట్టించాడు.

చివరికి...

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు... బెంగళూరు నుంచి వచ్చిన యువతి ఇంకా రమేశ్​ చెరలోనే ఉందని తెలుసుకున్నారు. నిర్బంధం నుంచి కాపాడారు. ప్రేమ పేరుతో నమ్మించి చివరికి తన కోసం వచ్చిన యువతిని ఇంతగా హింసించిన రమేశ్​ పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు ఈ కిడ్నాప్ వ్యవహారానికి సహకరించిన అతని స్నేహితుడు, రమేశ్​ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: kidnap case: కుమారుడిలా ఉన్నాడని కిడ్నాప్‌.. 4 నెలల తర్వాత అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.