గదిలో బంధించి మహిళపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Dec 20, 2022, 8:58 AM IST

Woman Gang raped vijayawada

08:45 December 20

మహిళను గదిలో బంధించి.. నలుగురు వ్యక్తులు అత్యాచారం

Vijayawada Gang Rape: ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో దారుణం జరిగింది. కూలి పనులు చేసుకునే మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు మానవ మృగాళు ఆ మహిళపై మూడు రోజుల పాటు అఘాయిత్యం చేశారు. ఈ నెల 17న మహిళను నమ్మించి ఓ వ్యక్తి గదిలోకి తీసుకువెళ్లాడు. అనంతరం మద్యం మత్తులో నలుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అస్వస్థతకు గురికావటంతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.