ETV Bharat / crime

మహిళా వాలంటీర్​ దారుణ హత్య.. కారణమదేనా..?

author img

By

Published : May 16, 2022, 9:37 AM IST

ఓ మహిళా వాలంటీర్ దారుణ హత్యకు గురైంది. ఇంటి ముందు శుభ్రం చేస్తున్న ఆమెపై.. ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తప్పించుకోబోయిన ఆమెను కొద్దిదూరం వెంటబడి మెడపై కోసి పరారయ్యాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

మహిళా వాలంటీర్​ దారుణ హత్య.. కారణమదేనా..?
మహిళా వాలంటీర్​ దారుణ హత్య.. కారణమదేనా..?

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళా వాలంటీర్‌ను అతి కిరాతకంగా పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27)ను అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి 2008లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద స్థానికంగా వాలంటీర్‌గా పని చేసేది. అదే గ్రామానికి చెందిన ఎం.పద్మారావుతో ఆమెకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం.. సాన్నిహిత్యానికి దారి తీసింది. 6 నెలల క్రితం ఆమె ప్రవర్తనను అనుమానించిన పద్మారావు సచివాలయం వద్ద ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ విషయంపై అప్పట్లో సచివాలయం మహిళా పోలీస్‌ వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతన్ని మందలించి వదిలేశారు.

ఈ నేపథ్యంలో శారదపై ద్వేషం పెంచుకున్న పద్మారావు ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు శుభ్రం చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తప్పించుకోబోయిన ఆమెను కొద్ది దూరం వెంటబడి మెడపై కోసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హత్య విషయం తెలుసుకున్న వేమూరు పోలీసులు, చుండూరు సీఐ కల్యాణ్‌రాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. శారద, పద్మారావు మధ్య వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో ఆమె దూరంగా ఉంచడం, ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే పద్మారావు హత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శారద (పాతచిత్రం)

ఇవీ చూడండి..

యాదాద్రీశుని సన్నిధిలో అమానవీయ ఘటన.. చెత్తబండిలో బాలిక మృతదేహం తరలింపు

Car accident: అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. అనంత లోకాలకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.