ETV Bharat / crime

undavalli accident : ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 23, 2021, 4:58 PM IST

accident
accident

undavalli accident : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

undavalli accident : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్​ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఉండవెల్లి మండలం షేర్​పల్లికి చెందిన మద్దిలేటి రెడ్డి, శంకర్​ ఘటనా స్థలిలోనే మృతి చెందారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జైన ద్విచక్రవాహనం
ప్రమాదంలో నుజ్జునుజ్జైన ద్విచక్రవాహనం

car hits two wheelar at undavalli : మద్దిలేటి రెడ్డి, శంకర్​ ద్విచక్రవాహనంపై (AP 21 BC 5504) కర్నూల్​ నుంచి షేర్​పల్లికి వెళ్తున్నారు. అలంపూర్​ చౌరస్తాకు సమీపంలో వీరి బైక్​ను కర్నూల్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న కారు (KA 05 NC 0031) వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను అంబులెన్సులో అలంపూర్​ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: Headless corpse: బొంగులూరు వద్ద తల లేని మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.