ETV Bharat / crime

లొంగిపోయిన మరో మావోయిస్టు.. దళం సభ్యులకు పోలీస్​బాస్ వార్నింగ్

author img

By

Published : Oct 8, 2022, 2:03 PM IST

Updated : Oct 8, 2022, 3:59 PM IST

Maoist leader Vijayakka surrendered: మొబైల్‌ పొలిటికల్‌ టీచర్‌గా దండకారణ్యంలో సేవలందించిన మావోయిస్టు అగ్రనేత ఆలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 31 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న విజయక్క అనారోగ్య కారణాలతో లొంగిపోయారని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు.

Maoist leader Vijayakka surrendered
Maoist leader Vijayakka surrendered

Maoist leader Vijayakka surrendered: మావోయిస్టు అగ్రనేత ఆలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 31 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న విజయక్క అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. విద్యాభ్యాసం సమయంలోనే పీపుల్స్ వార్‌ అనుబంధ గ్రూపులలో పనిచేసిన విజయక్క.. 1991లో దళంలో చేరారు. మొబైల్ పొలిటికల్ టీచర్‌గా దండకారణ్యంలో సేవలందించిన ఉషారాణి.. మావోయిస్టు పొలిటికల్ మ్యాగజైన్స్‌కు ఎడిటర్​గా పని చేశారు.

2019 లోనే అనారోగ్యం కారణంగా లొంగిపోతానని పార్టీని ఆమె అభ్యర్థించింది. మావోయిస్టుల్లో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని.. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయ చర్యలు అందిస్తామని డీజీపీ తెలిపారు. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సెక్రటరీగా పనిచేసిన రామన్న భార్య రావుల సావిత్రి(46) పోలీసుల ఎదుట లొంగిపోయారు.

''31 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపిన ఆలూరి ఉషారాణి అలియాస్‌ విజయక్క ఈరోజు తెనాలి.. గుంటురు జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమెకు అనేక కేసుల్లో సంబంధం ఉంది. మావోయిస్టుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇస్తున్నాం''- డీజీపీ మహేందర్‌ రెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.