ETV Bharat / crime

రామాలయంలో చోరీ... విదేశీ కానుకలు మాయం

author img

By

Published : Mar 22, 2021, 2:00 PM IST

జగిత్యాల జిల్లా ధరూర్​లో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక రామాలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టారు. నగదు దోచుకుని పరారయ్యారు.

Theft in Ramalayam Unidentified persons destroyed the locker and robbed cash
రామాలయంలో చోరీ... విదేశీ కానుకలు మాయం

జగిత్యాల జిల్లా ధరూర్​లోని రామాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు.. అర్ధరాత్రి హుండీలను ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారు. గతంలో.. ఇదే తరహాలో ఆలయంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

భారీ మొత్తంలో.. నగదు అపహరణకు గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మధ్యనే ఓ ఎన్​ఆర్​ఐ దంపతులు.. హుండీలో అమెరికా డాలర్లు వేసి వెళ్లినట్లు వారు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.