Tourism Awards for RFC: రామోజీ గ్రూప్‌ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

author img

By

Published : Sep 27, 2021, 7:26 PM IST

Updated : Sep 27, 2021, 10:02 PM IST

Tourism Awards for RFC: రామోజీ గ్రూప్‌ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

రామోజీ గ్రూపు సంస్థలకు (ramoji film city) రాష్ట్ర పర్యాటక శాఖ రెండు పురస్కారాలు అందజేసింది. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో పురస్కారాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ప్రదానం చేశారు.

ప్రపంచ పర్యాటక మ్యాప్​లో స్థానం పొందగలిగే 20 వరకు చారిత్రక ప్రదేశాలు తెలంగాణలో ఉన్నాయని.. వరల్డ్ టూరిజం మ్యాప్​లో వాటన్నింటికీ చోటు దక్కేలా కృషి చేస్తామని పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud) ప్రకటించారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్​లో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను (tourism day) ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో చారిత్రక ప్రదేశాల విశిష్టతను తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన సీడీని మంత్రి శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న పలు సంస్థలకు ఎక్సలెన్స్ అవార్డులు (Excellence Awards) అందజేశారు. ఇందులో భాగంగా రామోజీ సంస్థలకు చెందిన సంస్థలు రెండు అవార్డుతో మెరిశాయి.

పర్యాటకులను ఆకర్షించే సంస్థలకు ప్రత్యక రాయితీలు

తెలంగాణ రాష్ట్రంలో అద్భుత చారిత్రక ప్రదేశాలున్నాయని.. గత పాలకుల స్వార్థం వల్ల ఇవన్నీ వెలుగులోకి రాలేక.. చాలా పర్యాటకాన్ని రాష్ట్రం కోల్పోయిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు వచ్చే విదేశీ పర్యాటకులు సైతం పెరిగారని మంత్రి తెలిపారు. వరంగల్ రామప్ప దేవాలయం మాదిరి రాష్ట్రంలోని ఇతర చారిత్రక ప్రాంతాలకు ఆ గుర్తింపు దక్కేలా పాటుపడతామని మంత్రి వెల్లడించారు. పర్యాటకులను ఆకర్షించే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్న మంత్రి.. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి టూరిజం కొరకు ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు.

రెండు అవార్డులతో మెరిసిన రామోజీ గ్రూపు సంస్థలు

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్విహించిన వేడుకల్లో రామోజీ గ్రూపు సంస్థలు రెండు అవార్డులతో మెరిశాయి. 2020, 2021 సంవత్సరాలకు గాను రెండు ఎక్సలెన్స్ (Excellence Awards) అవార్డులను కంపెనీ ప్రతినిధులు అందుకున్నారు. బెస్ట్ సివిక్ మేనేజ్ మెంట్ ఆఫ్ టూరిజం డెస్టినేషన్ -2021 కేటగిరీలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికవగా (Best Civic Management of Tourism)... 4 స్టార్ క్సాసిఫైడ్ హోటల్ కేటగిరీలో సితార హోటల్​కు మరో ఎక్సలెన్స్ అవార్డు దక్కింది (Four-star Hotel). ప్రపంచ ప్రమాణాలతో కూడిన డైనింగ్, గెస్ట్​హోస్టింగ్ వసతులు కల్పించినందుకు సితార హోటల్​కు ఈ గౌరవం దక్కిందని డాల్ఫిన్స్ హోటల్స్ జనరల్ మేనేజర్ టి.ఆర్.ఎల్ రావు తెలిపారు. వరల్డ్ టూరిజం వేడుకల్లో భాగంగా దక్కిన ఈ అవార్డుల పట్ల సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు తమ బాధ్యతను, గౌరవాన్ని మరింత పెంచాయని రామోజీ గ్రూపు సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.

అక్టోబర్​ 8 నుంచి అందుబాటులోకి

కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అక్టోబర్ 8 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ పూర్తి స్థాయిలో పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటుందని రామోజీ ఫిల్మ్ సిటీ ఉపాధ్యక్షులు కె. వెంకటరత్నం తెలిపారు.

రామోజీ గ్రూప్‌ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

ఇదీ చదవండి :

Last Updated :Sep 27, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.