ETV Bharat / crime

డీసీఎం వాహనాన్ని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం

author img

By

Published : Feb 10, 2023, 6:15 AM IST

Updated : Feb 10, 2023, 6:38 AM IST

accident
accident

06:09 February 10

డీసీఎం వాహనాన్ని ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం

Road Accident at Tummanoor Today: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్​లో జరిగిన ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను నాగర్​కర్నూల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

మృతులు నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు(35), యాదయ్య(34), శ్రీను(30), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి(32)గా పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 10, 2023, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.