ETV Bharat / crime

గేదెను తప్పించబోయి..ప్రాణాలు కోల్పోయి..

author img

By

Published : Apr 11, 2021, 12:16 PM IST

గేదెను తప్పించబోయిన ఓ ద్విచక్రవాహనం పంటపొలల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతావోలు శివారులో చోటుచేసుకుంది.

Road accident in Suryapeta district
సూర్యపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతావోలు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెను తప్పించబోయిన ఓ ద్విచక్రవాహనం పంటపొలల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గరిడేపల్లి మండలం మంగపురానికి చిందిన కత్తి గురుస్వామి మృతి చెందగా... అనిల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

శవ పరీక్ష నిమిత్తం గురుస్వామిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన అనిల్‌ను చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లారు. వీరిద్దరు వరికోత యంత్రం డ్రైవర్లుగా తెలుస్తుంది.

ఇదీ చదవండి: భార్యను కత్తితో నరికిన చింపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.