ETV Bharat / crime

నగరంలో గంజాయి విక్రయం... పోలీసుల అదుపులో నలుగురు

author img

By

Published : Feb 20, 2021, 10:37 AM IST

police-arrested-four-people-for-selling-cannabis-in-hyderabad
నగరంలో గంజాయి విక్రయం... పోలీసుల అదుపులో నలుగురు

డబ్బులు ఈజీగా సంపాదించాలనే లక్ష్యంతో గంజాయిని అమ్ముతున్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ జిల్లా బొల్లారంకు చెందిన శ్రీకర్, అక్రమ్, ఫెరోజ్​తో పాటు మరో మైనర్ బాలుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నుంచి గంజాయిని హైదరాబాద్​కి తీసుకొచ్చి పలువురికి విక్రయించారు.

సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు... నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్​కు తరలించి... మైనర్​ను జువైనల్ హోమ్​కు తరలించారు. .

ఇదీ చూడండి: మైనర్​పై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.