ETV Bharat / crime

శివారు ప్రాంతంలో హత్య చేసి... నగలతో ఉడాయించి

author img

By

Published : Apr 1, 2021, 10:24 AM IST

పని ఉందని నమ్మించి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి... గొడ్డలితో ఓ మహిళ తల నరికి చంపాడో వ్యక్తి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

police arrested accused in women murder case at sangareddy
శివారు ప్రాంతంలో హత్య చేసి... నగలతో ఉడాయించి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​ వడ్డెర కాలనీలో ఉంటున్న లక్ష్మీ తన భర్త నారాయణతో కలిసి కూలీ పని చేసుకుని జీవిస్తుంది. ఈనెల 26వ తేదీన గతంలో పరిచయమున్న తుక్కాపూర్​కు చెందిన మేస్త్రీ కృష్ణ వచ్చాడు. తన వరిపొలంలో పని ఉందని నమ్మించి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అతి దారుణంగా గొడ్డలితో తల నరికి చంపాడు.

ఆమె వద్దనున్న బంగారం, వెండి ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా కృష్ణ... లక్ష్మీని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని... రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి.. భర్త, మామపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.