ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

author img

By

Published : May 20, 2021, 8:05 PM IST

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతోన్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.

accident in Sangareddy district
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరిగింది.

జిల్లాలోని జహీరాబాద్ పట్టణం ఆనంద్ నగర్ కాలనీకి చెందిన బురకల రాజు(55) కిరాణం దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం పట్టణంలోకి వచ్చిన అతడు దుకాణంలోకి అవసరమైన సామాను తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎర్ర రాయి లోడుతో వస్తున్న లారీ వెనక నుంచి అతడు ప్రయాణిస్తోన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏటీఎంలో సాయం పేరుతో మోసం... 2 లక్షలు కాజేసిన కేటుగాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.