జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో తెరాస ముఖ్యనేత ఇంట్లో పనిచేసే బాలిక గర్భవతి అయినట్లు వెలుగు చూసింది. విషయం తెలిసిన శిశు సంక్షేమ అధికారులు బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా రాయికల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యనేత ఇంట్లో పని చేసే యువకుడు ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాలికను శిశు సంక్షేమ అధికారులు చేరదీసి వారి సంరక్షణలో ఉంచారు.