ETV Bharat / crime

Loan App Case: రుణ యాప్‌ల కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు

author img

By

Published : Aug 30, 2021, 6:37 PM IST

Updated : Aug 30, 2021, 7:56 PM IST

loan app
loan app

18:36 August 30

రుణ యాప్‌ల కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు

రుణ యాప్‌ల కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌
రుణ యాప్‌ల కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌

రుణ యాప్‌ల కేసులో నిలిపివేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదును మళ్లించినందుకు బ్యాంకు మేనేజర్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతా అలీపూర్‌ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ రాకేశ్‌ కుమార్‌ దాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిలిపివేసిన ఖాతాల్లో నుంచి నగదు బదిలీ అయిందని జూన్‌లో గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్‌కతాలోని ఆలీపూర్‌ బ్రాంచ్‌ నుంచి రూ.1.18 కోట్ల నగదు బదిలీ అయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 దర్యాప్తు చేసిన పోలీసులు మేనేజర్‌ రాకేష్‌ కుమార్‌ దాస్‌ను ప్రశ్నించగా.. సైబర్‌ క్రైం ఎస్సై బ్రాంచ్‌కు వచ్చి నగదు డీప్రీజ్‌ చేయమని చెప్పాడని అందుకే నగదు బదిలీ చేసినట్లు తెలిపాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా... కమిషన్‌ కోసం ఖాతాల్లో నుంచి నగదు బదిలీ చేసినట్లు తేలింది. ఎస్సైలా వెళ్లిన ఆనంద్‌ జన్నును, అతనికి సహకరించిన నల్లమోతు అనిల్‌ కుమార్‌ను జూన్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ఇదీ జరిగింది... 

 కొంత కాలం కిందట హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో నమోదైన ఓ కేసులో కోల్‌కతా, గుర్‌గావ్‌లలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న నిందితుల ఖాతాల లావాదేవీలను పోలీసులు స్తంభింపజేశారు. ఇటీవల ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌  కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి తనకు తాను కోల్‌కతా సైబర్‌ ఎస్సైనంటూ పరిచయం చేసుకొని, నకిలీ గుర్తింపు కార్డునిచ్చాడు. హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు స్తంభింపజేసిన ఖాతాను పునరుద్ధరించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు పంపించారంటూ ఓ ప్రతిని బ్యాంకు అధికారులకు అందజేశాడు. గుర్‌గావ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లోనూ అదే సమయంలో ఇలాంటి నకిలీ పత్రాలనే సమర్పించారు. బ్యాంకు అధికారులు ఆ ఖాతాను మనుగడలోకి తెచ్చారు.

రూ.1.18 కోట్లు బదిలీ..

కొద్ది క్షణాల్లోనే రెండు ఖాతాల్లోని మొత్తం రూ.1.18 కోట్లు బదిలీ అయ్యాయి. ఇదంతా వెంటనే జరిగిపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు విచారణ చేస్తే.. ఉత్తర్వుల ప్రతులన్నీ నకిలీవని తేలింది. వెంటనే హైదరాబాద్‌లోని బ్యాంకు అధికారులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. ఆ మొత్తం అంటే కోటి 18 లక్షల రూపాయలు హైదరాబాద్​ బేగంపేటకు చెందిన ఆనంద్​ గన్నోజు అనే వ్యక్తి ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. అతని ఖాతాను స్తంభింపచేశారు.

 అయితే అప్పటికే ఆ నగదు అంతా చైనాకు బదిలీ అయినట్లు సైబర్​ క్రైం పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నకిలీ ఎస్సై అనిల్ కుమార్​ను అరెస్టు చేశారు. ఫ్రీజ్‌ చేసిన బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైం పోలీసుల పేరుతో లేటర్‌ ప్యాడ్‌లు, స్టాంపులు తయారు చేసి దిల్లీ, గురుగ్రామ్‌లలోని ఆయా బ్యాంకులకు నేరగాళ్లు పంపించినట్లు గుర్తించారు. 

ఇదీ చూడండి: చైనా​ యాప్​ ద్వారా రూ.50 కోట్ల భారీ స్కామ్​

Last Updated :Aug 30, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.