ETV Bharat / crime

కరోనా వచ్చిందని... చెరువులో దూకి ఆత్మహత్య!

author img

By

Published : May 10, 2021, 8:45 AM IST

కరోనా మానసికంగానూ చంపుతోంది. ఓ వ్యక్తి తనకు కరోనా సోకిందని... మనస్తాపానకిి గురై... చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది.

jumped in the pond and committed suicide
jumped in the pond and committed suicide

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెద్దచెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కోదాడ పట్టణానికి చెందిన గునుగుంట్ల నవీన్​గా పోలీసులు గుర్తించారు. జ్వరం రావడంతో వారం నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న నవీన్​.. నిన్న ఉదయపు నడకకు వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని స్థానికులు తెలిపారు.

కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న నవీన్​.. మనస్తాపానికి గురై... ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. నవీన్​ నిడమనూరు పోస్ట్​ ఆఫీస్​లో ఉద్యోగం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కష్టకాలంలో సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.