ETV Bharat / crime

రోడ్డుప్రమాదంలో తాత, మనుమరాలు దుర్మరణం

author img

By

Published : May 10, 2021, 4:19 PM IST

siddipet accident
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదంలో తాత మనుమరాలు మృతి

సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత మనుమరాలు దుర్మరణం చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా లక్ష్మీదేవి పల్లికి చెందిన నాగర్తి నర్సారెడ్డి, అనన్యగా పోలీసులు గుర్తించారు.

రహదారి ప్రమాదంలో తాత, మనుమరాలు దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం అహ్మదీపూర్​ చౌరస్తాలో జరిగింది.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లక్ష్మీదేవి పల్లికి చెందిన నాగర్తి నర్సారెడ్డి.. సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్​లోని తన కుమార్తె వద్దకు ఆదివారం సాయంత్రం వచ్చాడు. రాత్రి అక్కడే ఉండి.. సోమవారం ఉదయం తన మనుమరాలు అనన్యను తీసుకొని ద్విచక్రవాహనంపై కామారెడ్డి జిల్లా బయలుదేరాడు.

అహ్మదీపూర్​ గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తీవ్ర గాయాలపాలైన అనన్యను అంబులెన్స్​లో గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనన్య మరణించింది.

ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీచూడండి: ఒకరికి తెలియకుండా ఒకరు.. ఒకే ఇంట ముగ్గురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.