ETV Bharat / crime

గ్యాస్ సిలిండర్​ నుంచి మంటలు.. సామగ్రి దగ్ధం

author img

By

Published : Jan 27, 2021, 10:23 PM IST

ఏపీ కృష్ణా జిల్లా నందిగామలోని ఓ ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. హోటల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కొంత ఫర్నీచర్ దగ్దమైంది.

గ్యాస్ సిలిండర్​ నుంచి మంటలు.. ఫర్నిచర్ దగ్ధం
గ్యాస్ సిలిండర్​ నుంచి మంటలు.. ఫర్నిచర్ దగ్ధం

ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ పట్టణలోని భారత్​ టాకీస్ సెంటర్​లో లక్ష్మీ త్రివేణి ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్​లో నుంచి మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో కొంత ఫర్నీచర్ దగ్దమైంది. వెంటనే అప్రమత్తమైన ఫాస్ట్​ఫుడ్ నిర్వాహకులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటళ్లలో వంట చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు మాత్రం వాడవద్దని, అలాంటి సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

గ్యాస్ సిలిండర్​ నుంచి మంటలు.. ఫర్నిచర్ దగ్ధం

ఇదీ చదవండి: ఆ కార్లను ఓఎల్ఎక్స్​లో విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.