సిబ్బంది నిర్లక్ష్యం.. తారుమారైన శిశువులు.. డీఎన్​ఏ పరీక్ష చేస్తే గానీ..!

author img

By

Published : Dec 28, 2022, 10:42 AM IST

Exchange of Babies in Government Hospital
Exchange of Babies in Government Hospital ()

Babies Exchange in Government Hospital : సాధారణంగా ఆసుపత్రిలో ప్రసవాలు జరిగితే పుట్టిన బిడ్డ ఎవరనేది డాక్టరో.. లేదంటే నర్సో చెప్పే వరకు తెలియదు. ఆసుపత్రిలో ఒక్క కాన్పు జరిగిందంటే ఇబ్బంది లేదు. అంతకుమించి ప్రసవాలు జరిగి ఆ సమయంలో శిశువులు మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది..? కుటుంబసభ్యులు పిల్లలను ఎంత గుర్తించినా, ఆ అనుమానాలు మాత్రం తీరవు. ఓ ప్రభుత్వాసుపత్రిలో సినీఫక్కీలో జరిగిన ఇలాంటి ఘటనే తీవ్ర గందరగోళానికి గురి చేసింది.

ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేపిన శిశువుల మార్పిడి.. సిబ్బందుల నిర్లక్ష్యమే కారణం..!

Babies Exchange in Government Hospital : మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం రేపింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. చెన్నూరుకు చెందిన ఓ గర్భిణీ ప్రసవం కొరకు ఆసుపత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న వైద్యురాలు ఆమెకు శస్త్రచికిత్స చేసింది. కొద్ది నిమిషాల తేడాతో మరో గర్భిణీకి కాన్పు చేశారు.

ఇద్దరు మహిళల్లో ఒకరికి ఆడబిడ్డ, మరొకరికి మగబిడ్డ జన్మించారు. ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ బయట ఇద్దరు మహిళలకు చెందిన కుటుంబసభ్యులు ఎదురుచూస్తుండగా, ఆసుపత్రిలోని నర్సులు ఆడశిశువును ఇవ్వాల్సిన వారికి మగబిడ్డను అప్పగించారు. కాసేపట్లోనే తేరుకోని పొరపాటు జరిగిందని, ఆడశిశువును ఇవ్వాల్సిందిబోయి మగశిశువును ఇచ్చినట్లు నచ్చజెప్పేందుకు యత్నించారు. అప్పటికే శిశువుకు ప్రాథమిక చికిత్స చేయించుకుని రావటంతో గందరగోళం నెలకొంది.

వారికి నచ్చజెప్పేందుకు ఆసుపత్రి సిబ్బంది యత్నించినా మగశిశువును ఇచ్చేందుకు ససేమిరా అనటంతో ఆసుపత్రిలో కలకలం రేగింది. బిడ్డ పుట్టిన సమయంలోనే ఆడశిశువు జన్మించినట్లు ఓ తల్లికి వైద్యులు చెప్పారు. కానీ సిబ్బంది నిర్వాకంతో బయట ఉన్న బంధువుల్లో అనుమానాలు నెలకొన్నాయి. పిల్లలు పుట్టిన వెంటనే వారి వివరాలతో బయటికి పంపామని సిబ్బంది తికమకపడి, ఈ పరిస్థితి తెచ్చినట్లు ఆసుపత్రి వైద్యురాలు చెబుతున్నారు.

పిల్లల మార్పిడికి ఘటనపై స్పందించిన ఆసుపత్రి పర్యవేక్షణాధికారి పిల్లల తల్లులు చెబుతున్నా వారి బంధువులు వినటంలేదని, పూర్తిస్థాయిలో నిర్ధారణ వచ్చే వరకు పిల్లలను శిశుసంక్షేమశాఖకు అప్పగించనున్నట్లు చెప్పారు. డీఎన్​ఏ పరీక్షతోనే ఈ విషయంలో స్పష్టత రానుండగా ఇందుకు మరో 15రోజుల వరకు పట్టే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.