ETV Bharat / crime

dead infant in sulabh complex : సులభ్ కాంప్లెక్స్​లో మృత శిశువు.. ఎవరిది?

author img

By

Published : Dec 11, 2021, 1:28 PM IST

Updated : Dec 11, 2021, 1:56 PM IST

dead infant in sulabh complex , ram nagar sulab complex
సులభ్ కాంప్లెక్స్​లో మృత శిశువు

dead infant in sulabh complex : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ చేపల మార్కెట్ వద్ద ఉన్న సులబ్ కాంప్లెక్స్‌లో గుర్తుతెలియని మహిళ ప్రసవించింది. మృతి చెందిన శిశువును చున్నీలో పెట్టి అక్కడే వదిలివెళ్లింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.

dead infant in sulabh complex : కరీంనగర్ నగరంలోని రామ్ నగర్ చేపల మార్కెట్ సులభ్ కాంప్లెక్స్​లోని బాత్​రూంలో గుర్తుతెలియని గర్భిణీ డెలివరీ అయింది. మృత శిశువు బాత్​రూంలో పడి ఉంది. మార్కెట్​లో చేపలు విక్రయించే మహిళలు చూసి.. వెంటనే వాచ్​మెన్​ సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.

కరీంనగర్ టౌన్ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా ఆ గర్భిణీ ఎవరూ అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ సులభ్ కాంప్లెక్స్​కు వచ్చినట్లు వాచ్​మెన్​ పోలీసులకు తెలిపారు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: Harish rao in Gandhi hospital : 'గాంధీ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం'

Last Updated :Dec 11, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.