ETV Bharat / crime

WOMEN MURDER: గుంటూరు మహిళ హత్య కేసులో... కోడలే నిందితురాలు

author img

By

Published : Aug 31, 2021, 12:41 PM IST

ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోడలు ప్రియాంకే.. అత్త మైథిలిని కత్తితో పొడిచి, చపాతి కర్రతో కొట్టి హత్య చేసినట్లు నిర్ధారించారు.

WOMEN MURDER
మహిళ హత్య

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోడలు ప్రియాంకే అత్త మైథిలిని హత్య చేసినట్లు నిర్ధారించారు. అత్తాకోడళ్ల మధ్య గొడవ కారణంగా... అత్తను కత్తితో పొడిచి, చపాతి కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితురాలు ప్రియాంకను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

తెనాలి బస్టాండు సమీపంలోని ప్యారడైజ్ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్ నెంబర్ 306లో పాన్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తున్న బద్రి నారాయణ మూర్తి, మైథిలి(53) దంపతులు నివసిస్తున్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం నవీన్​ అనే వ్యక్తిని దత్తత తీసుకుని... అతనికి వివాహం చేశారు.

ఇదిలా ఉండగా... ఈనెల 28న తాడికొండ మైథిలి(53) అపార్టుమెంట్​లో అనుమానాస్పదంగా మృతి చెందింది. విచారణ చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించారు. అత్తతో జరిగిన గొడవ కారణంగానే కోడలు కత్తితో పొడిచి, చపాతీ కర్రతో కొట్టి హత్య చేసినట్లు వెల్లడించారు.

తలకు గాయాలు.. రక్తపు మడుగులో మృతదేహం

శనివారం రాత్రి దాదాపు ఏడున్నర గంటల సమయంలో... ఫ్లాట్ నెంబర్ 306 నుంచి పెద్దగా ఏడుపులు వినిపించాయని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి మైథిలి రక్తపుమడుగులో పడి ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: Murder attempt: గొంతు కోసేసుకుంది.. ఎవరో కోసేశారని నమ్మించాలని చూసింది!

Car crash: పెళ్లింట విషాదం నింపిన 'కారు గల్లంతు' ఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.