ETV Bharat / crime

కేసు నమోదులో వైఫల్యం.. సీఐ, ఎస్సైను సస్పెండ్​ చేసిన అధికారులు

author img

By

Published : Nov 23, 2022, 9:34 PM IST

CI SI suspend in Kurnool: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ మూడో పట్టణ సీఐ చంద్రబాబు, ఎస్సై పీరయ్యను సస్పెండ్ చేశారు. గత ఏడాది వీరిద్దరూ వేర్వేరు కేసులను అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినందుకు అధికారులు సస్పెండ్ చేశారు.

CI SI suspend in Kurnool
CI SI suspend in Kurnool

CI SI suspend in Kurnool: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణ మూడో పట్టణ సీఐ చంద్రబాబు, ఎస్సై పీరయ్యను కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ సస్పెండ్ చేశారు. గత ఏడాది వీరిద్దరూ వేర్వేరు కేసులను అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినందుకు అధికారులు సస్పెండ్ చేశారు. గత ఏడాది 2020లో బ్రహ్మణకొట్కూరు ఎస్సైగా ఉన్నప్పుడు దామగట్ల చెందిన మాసుంవలి హత్య కేసును అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినందుకు సీఐ చంద్రబాబు సస్పెండ్ చేశారు.

2020 ఏడాదిలో శ్రీశైలం ఎస్సై పనిచేస్తున్న పీరయ్య సున్నిపెంట వేద పాఠశాలలో గురువు వేధింపులకు విద్యార్థి మదుకుమార్ శర్మ మృతి చెందాడు.. దీన్ని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినందుకు ఎస్సై పీరయ్య సస్పెండ్ చేశారు. రెండు కేసులను విచారణ చేసి హత్య కేసులను.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేయటంతో వీరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ ఆదోనిలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.