ETV Bharat / crime

Road accident: ప్రమాదంలో నవవధువు మృతి.. 'హేమ ఎక్కడంటూ' భర్త...

author img

By

Published : Nov 13, 2021, 2:18 PM IST

road accident news, ap accident news
రోడ్డు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి

పర్యాటక అందాలు తిలకించేందుకు బయల్దేరారు ఆ నవదంపతులు(newly marriage couple). సరదాగా బైక్​పై కబుర్లు చెప్పుకుంటూ వెళ్దామనుకున్నారు. కానీ ఇంతలోనే కారు రూపంలో మృత్యువు(newly married couple died in visakha dist vanjangi) దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో(Road accident news) నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన భర్త... భార్య చనిపోయిన విషయం తెలియక 'హేమను పిలవండి' అని అడగడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి రోడ్డుపై విషాదం(newly married couple died in visakha dist vanjangi) జరిగింది. పర్యాటక ప్రాంతాలను చూడడానికి నవదంపతులు బయల్దేరారు. వారిద్దరూ బైక్​పై వెళ్తుండగా కారు రూపంలో మృత్యువు(newly married couple died in visakha dist vanjangi) ఎదురొచ్చింది. వంజంగిలో వారి ద్విచక్రవాహనం-కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో నవవధువు హేమ అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తరుణ్‌ కుమార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వంజంగిని తిలకించేందుకు విశాఖ సీతంపేట నుంచి మూడు ద్విచక్రవాహనాలపై స్నేహితులతో కలిసి ఈ నవ దంపతులు వస్తుండగా.. వారి బైక్ ప్రమాదానికి గురైంది. కాగా.. ఈ ఘటనలో భార్య చనిపోయిన విషయం తెలియని భర్త ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. హేమను పిలవండి అంటూ విలపించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ప్రమాదంలో నవవధువు మృతి

ఇదీ చదవండి : Murder case news: మంత్రాల నెపంతో మతిస్థిమితం లేని వ్యక్తిని చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.