ETV Bharat / crime

ఆటో బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

author img

By

Published : Dec 5, 2022, 8:32 AM IST

Updated : Dec 5, 2022, 12:31 PM IST

Auto bolta at vemuru mandal
Auto bolta at vemuru mandal

06:09 December 05

ఆటో బోల్తాపడి నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం

Road Accident In Bapatla: ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. వేమూరు మండలం జంపని సమీపంలోని చివుకులవారి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం నూలుపూడి గ్రామానికి చెందిన 23 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి దీక్ష ముగించుకుని తిరిగి వస్తున్నారు. సోమవారం ఉదయం తెనాలిలో రైలు దిగి అక్కడి నుంచి టాటా ఏస్‌ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో వాహన డ్రైవర్‌ నిద్రమత్తులో జంపని వద్ద రోడ్డు పక్కనే ఉన్న పోలీసు హెచ్చరిక బోర్డును ఢీకొట్టాడు. దీంతో వాహనం బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో బొలిశెట్టి పాండు రంగారావు, పాశం రమేశ్‌, బోదిన రమేశ్‌, బుద్దన పవన్‌కుమార్‌ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో .. మరో ముగ్గురు భరత్ కుమార్, పుప్పాల శ్రీనివాసరావు, లింకన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. సమాచారం అందుకున్న వేమూరి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు కన్నతండ్రిని చంపిన కొడుకు!

Last Updated :Dec 5, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.