ETV Bharat / crime

ఏవోబీలో పేలిన మందుపాతర.. జవానుకు తీవ్రగాయాలు

author img

By

Published : Feb 21, 2021, 8:17 PM IST

aob-a-landmine-blast-targeting-bsf-jawans
ఏవోబీలో పేలిన మందుపాతర.. జవానుకు తీవ్రగాయాలు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్​గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలో.. దోల్​దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. బీఎస్​ఎఫ్​కు చెందిన ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కన్​గిరి జిల్లా మత్తిలి ఠాణా పరిధిలోని.. దోల్​దలి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని 160వ బెటాలియన్​కు చెందిన ధర్మేంద్ర సాహుగా గుర్తించిన అధికారులు చికిత్స కోసం అతడిని రాయ్​పూర్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో.. ఛత్తీస్​గఢ్ సీఆర్​పీఎఫ్, ఒడిశా బీఎస్​ఎఫ్​ బలంగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇదే సమయంలో మందు పాతర పేలి.. జవాను గాయపడ్డాడు.

ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలో పేలుడు.. కార్మికురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.