ETV Bharat / crime

కుటుంబంపై కరోనా కాటు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : May 11, 2021, 3:34 PM IST

పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా ఏనాడూ కుంగిపోలేదు. తన ఆలనా పాలనా చూసే తల్లి.. కంటికి రెప్పలా కాపాడుకునే అన్నావదినలు ఉండగా తనకేంటనే ధీమాతో ఇన్నిరోజులు ఏ చింత లేకుండా హాయిగా ఉన్నాడు. కానీ కరోనా మహమ్మారి ఒక్కసారిగా ఆ కుటుంబ పరిస్థితులను తలకిందులు చేసేసింది. వైరస్​ బారినపడి అమ్మ చనిపోగా.. అన్నావదినలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీటన్నింటితో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

a young man suicide attempt
a young man suicide attempt

నాగర్​కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. వైరస్​ కాటుతో తల్లి మృతి చెందగా.. అన్నా వదినలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రాజేశ్​ అనే యువకుడు కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన రాజేశ్​ ఆలనా పాలనా తల్లి చూసేది. కొవిడ్​ బారినపడి అమ్మ చనిపోవడం, అన్నావదినలు ఆస్పత్రి పాలుకావడంతో మనస్తాపానికి గురైన రాజేశ్​ ఆత్మహత్యాయత్నం చేశాడు. కరోనా భయంతో గ్రామస్థులు ఎవరూ దగ్గరకు రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్య ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్​నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపాాారు.

ఇదీ చూడండి.. బంధువులింటికి వెళ్తుండగా ప్రమాదం... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.