ETV Bharat / crime

సరుకులు కొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి

author img

By

Published : Apr 5, 2021, 2:57 PM IST

road accident in autonagar
ఆటోనగర్​లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్​పై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది.

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను డీసీఎం ఢీ కొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సరుకులు కొని...

హయత్​నగర్​కు చెందిన దంపతులు సరుకుల కోసం డీమార్ట్​కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోనగర్​ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న డీసీఎం వారిని ఢీ కొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: భగ్గుమన్న కారు.. నడిరోడ్డుమీదే బుగ్గిపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.