ETV Bharat / crime

రాజధానిలో మరో దారుణం... బాలికపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Jun 23, 2022, 2:52 PM IST

Updated : Jun 23, 2022, 3:15 PM IST

A MINOR GIRL RAPED IN CHHATRINAKA AREA IN HYDERABAD
రాజధానిలో మరో దారుణం... బాలికపై సామూహిక అత్యాచారం

14:49 June 23

బాలికపై సామూహిక అత్యాచారం

రాష్ట్ర రాజధానిలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటకు వస్తోంది. హైదరాబాద్‌ ఛత్రినాక పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తోంది.

ఇదీ జరిగింది... అలీ అనే యువకుడితో ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచి స్నేహితుడు అర్బాస్‌తో కలిసి అలీ అత్యాచారం చేశాడు. ఈ విషయంపై బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అలీ, అర్బాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఒకరు బాధిత బాలిక బంధువుగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి :

Last Updated :Jun 23, 2022, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.