ETV Bharat / crime

వారి హ్యాపీ జర్నీకి 'మూర్ఛ' బ్రేక్​.. చూస్తుండగానే కుటుంబమంతా..!

author img

By

Published : Jul 9, 2022, 8:17 PM IST

accident
accident

ఆ కుటుంబం తమ సొంత ఆటోలో ఊరికి బయలుదేరింది. కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సాఫీగా సాగిపోతోన్న వారి జర్నీకి అనుకోని ఉపద్రవం బ్రేక్​ వేసింది. కుటుంబాన్నంతా ప్రమాదంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారంతా.. ఆర్తనాదాలు చేయడం మొదలెట్టారు. వాళ్లకు ఎదురైన ఆ ఊహించని పరిణామం ఏంటంటే..?

వారి హ్యాపీ జర్నీకి 'మూర్ఛ' బ్రేక్​.. చూస్తుండగానే కుటుంబమంతా..!

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారంలో ఓ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​కు మూర్ఛ రావడంతో ఓ ఆటో జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో ఆటోలో డ్రైవర్​ సహా నలుగురు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాకూబ్ అనే డ్రైవర్​ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్​ నుంచి సంగారెడ్డి జిల్లా మునుపల్లి మండలం కంకోల్​కు ఆటోలో బయలుదేరాడు. సరదాగా.. కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. పటాన్​చెరు మండలం రుద్రారం వద్దకు రాగానే ఒక్కసారిగా ఆటో అదుపు తప్పింది. ఏంటా అని చూస్తే.. డ్రైవింగ్​ చేస్తున్న యూకూబ్​కు మూర్ఛ వచ్చింది. అటు.. యాకూబ్​ను చూసుకోవాలో.. ఇటు ఆటోను అదుపు చేయాలో.. తెలియక కుటుంబసభ్యులు అయోమయంలో పడ్డారు. అప్పటికే ఆటో.. రోడ్డు మీది నుంచి.. ఆ పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ అనుకోని ఘటనతో ఆటోలో ఉన్నవాళ్లు ఆర్తనాదాలు చేశారు.

బాధితుల అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించారు. కాలువలోకి దిగి వారందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పెను ప్రమాదం నుంచి బయటపడటంతో వాళ్లంతా బతుకు జీవుడా అనుకున్నారు. తమను రక్షించిన స్థానికులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానికులు శ్రమించి.. ఆటోను కూడా బయటకు లాగారు. విషయం తెలుసుకున్న యాకూబ్​ బంధువులు వచ్చి వారిని వెంటబెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లారు.

ఇవీ చూడండి..

Gold Theft Case: 3 కేజీల బంగారు ఆభరణాలతో.. డెలివరీ బాయ్స్ జంప్​!

ఎడతెరిపి లేని వాన.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.