ETV Bharat / crime

రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 19, 2021, 8:45 PM IST

Updated : Feb 19, 2021, 10:44 PM IST

రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి
రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

20:43 February 19

రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

   నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. పలువురికి గాయాలయ్యాయి. బాపన్​పల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర ఆలయానికి ఇచ్చేందుకు గ్రామస్థులు దాతల సహకారంతో ఇనుప రథాన్ని తయారు చేయించారు. రథ సప్తమి మంచిరోజు కావడం వల్ల రథాన్ని దేవునికి అంకితమిచ్చేందుకు తీసుకువెళ్తున్నారు. 

    ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతం ఏర్పడింది. రథాన్ని లాగుతున్న వారికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ సంజనోల్ల చంద్రప్ప, హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రేమించాలని ఎయిర్​గన్​తో బెదిరింపులు

Last Updated : Feb 19, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.