ETV Bharat / city

'నకిలీ విత్తనాలను ఉపేక్షించేది లేదు'

author img

By

Published : Jun 6, 2020, 12:16 PM IST

కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విత్తన మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, నూకనకల్లు మండల కేంద్రాల్లో టాస్క్​పోర్స్​, పోలీస్​, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు.

ఎరువుల దుకాణాల్లో అధికారుల ఉమ్మడి తనిఖీలు
ఎరువుల దుకాణాల్లో అధికారుల ఉమ్మడి తనిఖీలు

తుంగతుర్తి, నూతనకల్లులో ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలను టాస్క్​ఫోర్స్, వ్యవసాయ, పోలీస్ అధికారులు శుక్రవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో నిలువ ఉంచిన ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. సమగ్ర వ్యవసాయం విధానంలో భాగంగా నిబంధనల ప్రకారం విత్తనాలు, ఎరువులను విక్రయించాలని తుంగతుర్తి ఏడీఏ జగ్గు నాయక్ సూచించారు.

రసీదులు తప్పనిసరిగా అందించాలని దుకాణదారులకు సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇవీ చూడండి: పదో తరగతి హాస్టల్‌ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.