ETV Bharat / city

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్​.. ఇద్దరు దుర్మరణం

author img

By

Published : Jul 8, 2020, 1:10 PM IST

కరీంనగర్​ జిల్లా సదాశివపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

KARIMNAGAR ACCIDENT
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్​.. ఇద్దరు దుర్మరణం

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం సదాశివపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

సదాశివపల్లి వద్ద లారీని నిలిపిన డ్రైవర్​ రోడ్డు దాటుతుండగా.. ద్విచక్రవాహనంతో అతివేగంగా వచ్చిన ముగ్గురు యువకులు ఢీకొట్టారు. ఘటనలో లారీ డ్రైవర్​ వెంకటేశ్వర్లుతోపాటు, మరో యువకుడు మహమ్మద్​ సల్మాన్​ దుర్మరణం చెందారు. మరో యువకుడికి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు యువకులు మద్యం తాగేందుకు కరీంనగర్​ నుంచి సదాశివపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. లారీ డ్రైవర్​ ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. అనంతరం రెండు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: తాగిన మైకంలో భర్తను చంపిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.