ETV Bharat / city

డబుల్ బెడ్​రూం కోసం.. తెలంగాణ భవన్ వద్ద ఆందోళన

author img

By

Published : Feb 29, 2020, 5:04 PM IST

డబుల్ బెడ్​రూంల కేటాయింపులో పేదలకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ భవన్ వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు.

women Dharna For Double Bed Room House At TRS Bhavan
డబుల్ బెడ్​రూం కోసం.. తెలంగాణ భవన్ వద్ద ఆందోళన

లాటరీల పద్ధతిలో కేటాయించిన 40 రెండు పడకల ఇళ్లలో 30 వరకు ఇప్పటికే ఇల్లు అనర్హులకు దక్కాయంటూ ఖమ్మంకు చెందిన మహిళలు హైదరాబాద్​లోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్​రూమ్ కేటాయింపుల్లో పేదలకు న్యాయం జరిగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ముప్పై ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ, కనీసం పిల్లలను కూడా చదివించుకోలేని స్థితిలో ఉన్నవారికి కాకుండా అనర్హులకు రెండు పడకల గదులు కేటాయించారని వాపోయారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా.. స్పందించడం లేదని, ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించారు.

డబుల్ బెడ్​రూం కోసం.. తెలంగాణ భవన్ వద్ద ఆందోళన

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.