ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

author img

By

Published : Jun 22, 2022, 6:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

  • తెలంగాణపై మరోసారి కరోనా పంజా

తెలంగాణలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఒక్కరోజులో 400కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

  • ఈనెల 25న ఇంటర్​ ఫలితాలు ?

ఈనెల 25న ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్​ బోర్డు సిద్ధమవుతోంది. జవాబు పత్రాల మూల్యాంకన సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన సందర్భంగా తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్​ తెలిపారు.

  • సంజయ్​కు భద్రత పెంపు

బండి సంజయ్​కు పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతమున్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్​ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేశారు. పర్యటనల సమయంలో ఆయనకు ఈ మేరకు అదనపు సిబ్బంది భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్​ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్​లో సంజయ్​ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించిన మీదట అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

  • 'నిమ్జ్‌'లో తొలి అడుగు

నిమ్జ్​లో రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమ వెమ్​ టెక్నాలజీస్​కు నేడు శంకుస్థాపన చేయనున్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు. 2013లో నిమ్జ్​కు అడుగులు పడగా... బుధవారం తొలి పరిశ్రమ నిర్మాణం కోసం భూమిపూజ జరగనుంది.

  • చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం

రాజ్యాంగసూత్రాలకు అనుగుణంగాలేని ఏ చట్టాన్నైనా కొట్టేసే శక్తి భారతీయ కోర్టులకుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ. భారతీయ న్యాయ వ్యవస్థలో చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. జర్మనీలోని దోర్త్‌మండ్‌లో 'ఆర్బిట్రేషన్‌ ఇన్‌ ఏ గ్లోబలైజ్డ్‌ వరల్డ్‌ - ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌' అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

  • నిర్మాణ 'భాగ్య'నగరం

భవన నిర్మాణాల్లో రాష్ట్ర రాజధాని దూసుకెళ్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో మూడో వంతు హైదరాబాద్​, దాని పరిసరాల్లోనే జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లోనూ అనుమతుల జోరు కొనసాగుతోంది. టీఎస్​బీపాస్​ ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధిక సంఖ్యలో భవనాలకు అనుమతి లభించింది.

  • ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్‌

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్​ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్​ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది విదేశాంగ శాఖ.

  • '3 నెలల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తాం'

ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ టెస్లాలో వచ్చే మూడు నెలల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్​ మస్క్​. బ్లూమ్​బర్గ్​ నిర్వహించిన ఖతార్​ ఎకనామిక్​ ఫోరమ్​లో పాల్గొన్న సందర్భంగా ఉద్యోగాల తొలగింపుపై పునరుద్ఘాటించారు.

  • 'సినీ కార్మికులు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు'

సినీ కార్మికులు సమ్మెకు వెళ్లాలంటే పరిశ్రమలోని నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్​ఛాంబర్​కు నోటీసు ఇవ్వాలన్నారు అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. కార్మికులు గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

  • 'బోల్డ్​ పాత్రల్లో నటించాలని ఉంది'

మంచి కథలు వస్తే ప్రేమకథల్లో, బోల్డ్‌ సీన్స్‌లో నటించాలని ఉందని అన్నారు సీనియర్ నటి అర్చన. ఆమె నటించిన తాజా నటించిన చిత్రం 'చోర్​బజార్​'. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్​ సహా చిత్ర విశేషాలు తెలిపారామె. ఆ సంగతులివీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.