ETV Bharat / city

HC: ఏపీలో పరిషత్ ఎన్నికల రీనోటిఫికేషన్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

author img

By

Published : Jun 25, 2021, 4:02 PM IST

ఎస్‌ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జులై 27కు వాయిదా వేసింది. పరిషత్‌ ఎన్నికల రీనోటిఫికేషన్‌ జారీచేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.

The High Court adjourned the hearing on the SEC petition to July 27
ఎస్‌ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జులై 27కు వాయిదా

ఆంధ్రప్రదేశ్​లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పరిషత్ ఎన్నికల రీనోటిఫికేషన్ జారీ చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది.

ఈ కేసు విషయంలో తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవద్దని ఏపీ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.