ETV Bharat / city

రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు విశాఖ బీచ్​లోనే

author img

By

Published : Mar 12, 2021, 1:39 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ బీచ్ గోవా బీచ్​లాగానే కనిపించబోతోంది ఇకమీదట. ఎలా అంటారా.. సముద్ర అలలను చూస్తూ ఉండిపోయేలా.. సేద తీరడానికి పర్యటకుల కోసం గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. గోవా బీచ్​లో ఎలా ఉన్నాయో...ఇప్పుడు మన దగ్గర కూడా అలానే ఉండబోతుంది. విశాఖ ఓ బీచ్​లో ఇలా ఉందో మీరు చూస్తారా..!

రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు విశాఖ బీచ్​లోనే
రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు విశాఖ బీచ్​లోనే

ఏపీలోని విశాఖ సముద్ర తీరంలో సందర్శకులను ఆకట్టుకునే విధంగా గుడారాలను ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్‌లోని ఇసుక తిన్నెలపై పర్యటకులు సేద తీరేందుకు రంగు రంగుల వస్త్రాలతో గుడారాలు తీర్చిదిద్దారు. జీవీఎంసీ అనుమతితో ఓ ప్రైవేటు సంస్థ వీటిని అందుబాటులోకి తెచ్చింది. గుడారాలను వినియోగించుకునే వారు గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ గుడారాలను చూసేవారు ఆర్కే బీచ్​.. గోవాను తలపిస్తోందని అంటున్నారు.

ఇదీ చూడండి. అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టి పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.