ETV Bharat / city

'నిరూపిస్తే అసెంబ్లీకి రాను'... నిమ్మల సవాల్

author img

By

Published : Dec 3, 2020, 10:10 PM IST

nimmala
nimmala

వైఎస్సార్ చేయూత పథకం విషయంలో తాను నిజాలు చెబితే... సభను తప్పుదోవ పట్టించానని ఎలా విమర్శిస్తారని తెదేపా ఏపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ గతంలో చెప్పిన విషయాలనే తాను సభలో ప్రస్తావించానని తెలిపారు.

బూతులు, అవాస్తవాలు మాట్లాడినట్లు నిరూపిస్తే తాను అసెంబ్లీకి వెళ్లనని తెదేపా ఏపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైఎస్సార్ చేయూత పథకం విషయంలో జగన్ గతంలో చెప్పిన విషయాలనే తాను సభలో ప్రస్తావించానని తెలిపారు. నిజాలు చెబితే సభను తప్పు దోవ పట్టించానని ఎలా విమర్శిస్తారని రామానాయుడు మండిపడ్డారు.

ఇదీ చదవండి : సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు కనుగొన్నప్పుడే దానికి విలువ: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.