ETV Bharat / city

శిరోముండనం కేసులో నూతన్​నాయుడిపై అట్రాసిటీ కేసు నమోదు

author img

By

Published : Sep 4, 2020, 11:05 PM IST

శిరోముండనం కేసులో నూతన్​నాయుడిపై అట్రాసిటీ కేసు నమోదు
శిరోముండనం కేసులో నూతన్​నాయుడిపై అట్రాసిటీ కేసు నమోదు

ఏపీ విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన ఓ యువకుడికి జరిగిన శిరోముండనం కేసులో... నటుడు, నిర్మాత నూతన్​నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ప్రస్తుతం అతను కర్ణాటక పోలీసుల కస్టడీలో ఉన్నారని, త్వరలో విశాఖ తీసుకొస్తామని చెప్పారు.

ఏపీ విశాఖ జిల్లాలో శిరోముండనం కేసుకు సంబంధించి.. సినీ నటుడు, నిర్మాత నూతన్​నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇంట్లో ఐఫోన్ పోయిందన్న కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిచి నూతన్ నాయుడు కుటుంబీకులు శిరోముండనం చేయించారు. ఈ దాడి వెనక నూతన్​నాయుడు ప్రమేయంపై ఆరా తీస్తున్నామని సీపీ పేర్కొన్నారు. నిందితుడ్ని కర్నాటకలోని ఉడిపిలో అరెస్ట్ చేశామని… ఆయన దగ్గర మూడు సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

అనుమతి కోరాం...

కర్ణాటక పోలీసులు అతడిని ఓ కోర్టులో హాజరుపరిచారని.. అక్కడి నుంచి తమ కస్టడీకి తీసుకునేందుకు అనుమతి కోరుతున్నామని వివరించారు. అలాగే... రిటైర్డ్ ఐఏఎస్ పీవి.రమేష్ పేరిట కొంతమందికి కాల్ చేసి… తన సొంత పనులు చేసుకోవాలని నూతన్​నాయుడు ప్రయత్నించినట్లు సీపీ వివరించారు.

ఆమెకు ఆరోగ్యం బాలేదని చెప్పమన్నారు...

కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్​తో పాటు మరో ముగ్గురు వైద్యులకు కాల్ చేసి శిరోముండనం కేసులో అరెస్టు అయిన వారిలో మధుప్రియ అనే మహిళకు ఆరోగ్యం బాలేదని ధ్రువీకరించాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. నూతన్​నాయుడు ప్రస్తుతం కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడని.. త్వరలోనే విశాఖపట్నం తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'కేంద్రం ఒత్తిడి తెస్తోంది... సంస్కరణలకే అన్నింటినీ ముడిపెడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.