ETV Bharat / city

రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి

author img

By

Published : May 25, 2022, 12:23 PM IST

nomination for rajya sabha seats
రాజ్యసభ స్థానాలకు నామినేషన్

Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, సబిత పాల్గొన్నారు.

Rajya Sabha Elections: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, హెటిరో గ్రూప్స్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్​లో పదవీకాలం ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. ఈ నెల 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీన నామినేషన్ల పరిశీలన, మూడోతేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్​, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'భాజపా నేతలు తెలంగాణ పరువు తీస్తున్నారు'

స్పైస్​జెట్​పై సైబర్ దాడి.. నిలిచిపోయిన ఫ్లైట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.