ETV Bharat / city

Telangana Corona Cases: రాష్ట్రంలో 494 కొత్త కేసులు.. నలుగురు మృతి

author img

By

Published : Jul 25, 2021, 9:34 PM IST

రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి నలుగురు మృత్యువాత పడ్డారు. కొవిడ్​ నుంచి మరో 710 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 9,405 కరోనా యాక్టివ్‌ కేసులు కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.

New Corona Cases in Telangana
New Corona Cases in Telangana

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,457 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 494 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,153 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో నలుగురు మరణించగా... ఇప్పటివరకు 3,784 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,27,964‬ మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.