ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు

author img

By

Published : Jan 26, 2021, 12:02 PM IST

రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందగా... ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,589కి చేరింది.

తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 189 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,589కి చేరింది.

కరోనాబారి నుంచి సోమవారం 349 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,88,926కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,072 ఉండగా వీరిలో 1543 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: ఆత్మనిర్భర్​ భారత్​కు ప్రతీకయే.. స్వదేశీ టీకా : గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.