ETV Bharat / city

Corona Cases: ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

author img

By

Published : Oct 11, 2021, 6:45 PM IST

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు
ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ బారినపడి ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది.

ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు
ఏపీలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో గడిచిన 24 గంటల్లో 23,022 కరోనా(corona virus) పరీక్షలు నిర్వహించగా.. 310 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపీలో 20,57,562 మంది వైరస్‌ బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌(covid) కారణంగా ఇద్దరు(corona deaths) మరణించారు. వైరస్ బారి నుంచి 994 మంది కోలుకోవడంతో ఏపీవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,36,048కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 7,258 యాక్టివ్‌ కేసులు(corona active cases) న్నాయి. మొత్తం ఇప్పటివరకు 2,87,67,963 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కరోనా వైరస్ బారినపడి ఇవాళ చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 54, నెల్లూరు జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: KCR Aerial view: మల్లన్నసాగర్‌ నిర్మాణం ఎంతవరకు వచ్చింది.. సీఎం ఏరియల్ వ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.