ETV Bharat / city

మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓంప్రకాష్ మృతి

author img

By

Published : Jul 27, 2020, 5:11 PM IST

మొద్దు శ్రీను హత్య కేసులో‌ నిందితుడు ఓంప్రకాష్ మృతి చెందాడు. శనివారం రాత్రి శ్వాస సమస్య రాగా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ome prakash
మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓంప్రకాష్ మృతి

మొద్దు శ్రీను హత్య కేసులో‌ నిందితుడు ఓంప్రకాష్ మృతి చెందాడు. ఏపీ విశాఖ ఆరిలోవలోని కేంద్ర కారాగారంలో ఉన్న ఓంప్రకాష్​కు శనివారం రాత్రి శ్వాస సమస్య వచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. వెంటనే కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. ఓంప్రకాష్​కు మూత్రపిండాలు చెడిపోవడం వల్ల చాలాకాలంగా డయాలసిస్ చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం కూడా కేజీహెచ్‌లోనే డయాలసిస్ జరిగిందని చెప్పారు. డయాలసిస్ తర్వాత మళ్లీ జైలుకి తరలించామని... శనివారం మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రికి పంపగా మృతి చెందాడని అధికారులు తెలిపారు.

ఓం ప్రకాష్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. ఓ లారీ చోరీ చేసిన కేసులో ఓం ప్రకాష్ అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2008 నవంబర్ 9న మొద్దు శ్రీనును బండరాయితో కొట్టి చంపాడు. నేరం రుజువు కావటంతో విశాఖ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇవీచూడండి: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్​.. భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.