ETV Bharat / city

బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారని అనుకుంటున్నారు, తగ్గేదే లే అంటున్న కవిత

author img

By

Published : Aug 22, 2022, 2:05 PM IST

Mlc Kavitha on Delhi liquor scam దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్​లో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుమార్తె కాబట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన దిల్లీ భాజపా నేతలపై దావా వేసేందుకు కవిత న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.

mlc kavitha
mlc kavitha

బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారని అనుకుంటున్నారు, తగ్గేదే లే అంటున్న కవిత

Mlc Kavitha on Delhi liquor scam దిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్‌ కుమర్తెను బద్నాం చేస్తే.. కేసీఆర్ తగ్గుతారనుకుంటున్నారు.. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గేది లేదని కవిత అన్నారు. ఆయణ్ని మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు.. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడేది లేదని ఆమె ధ్వజమెత్తారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే భాజపా కుట్రం చేస్తోంది.. ఏ దర్యాప్తుకైనా మేం సిద్ధమే అని కవిత వ్యాఖ్యానించారు.

'ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గేది లేదు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం... ఎవరికీ భయపడేది లేదు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే భాజపా కుట్ర. కేసీఆర్‌ కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్‌ తగ్గుతారనుకుంటున్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఏ దర్యాప్తునకైనా సిద్ధమే.. మాది పోరాటం చేసిన కుటుంబం'.-కవిత, ఎమ్మెల్సీ

భాజపా నేతలు విపక్షాలపై బట్టకాల్చి మీదేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలపై దుమ్మెత్తిపోసి తుడుచుకోమంటున్నారని మండిపడ్డారు. భాజపా ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. తమ కుటుంబంపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ బాటలోనే నడుస్తామని, ఎవరికీ భయపడం తేల్చి చెప్పారు.

దిల్లీ భాజపా నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై దావా వేయనున్నట్లు సమాచారం. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకే దావా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.