KBC: కేబీసీలో దాదా, సెహ్వాగ్​లకు కేటీఆర్​​పై ప్రశ్న.. అదేంటంటే..?

author img

By

Published : Sep 4, 2021, 4:41 PM IST

minister-ktr-tweet-as-forty-thousand-worth-question-in-hindi-kbc-program

హిందీలో ఎంతో పేరు మోసిన కార్యక్రమం. కోట్ల మంది చూసే అతి పెద్ద గేమ్​షో. బిగ్​ బీ అమితాబ్​ ఆ షోకి వ్యాఖ్యాత. అందులో పార్టిసిపెంట్లుగా ఇద్దరు లెజండరీ మాజీ క్రికెటర్లు. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఆ ఆటలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్​కు సంబంధించిన ప్రశ్న కంప్యూటర్​ స్క్రీన్​పై ప్రత్యక్షమైంది.. ఏంటా ప్రశ్న..? ఆ ప్రశ్నకు ఆ పార్టిసిపెంట్స్​ సమాధానం చెప్పారా..? చూసేయండి.

బాలీవుడ్ బిగ్​బీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న కౌన్​బనేగా కరోడ్​పతి- 13 వ సీజన్ ఆగస్టు 23న​ ప్రారంభమై.. ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ గేమ్​షో.. ఎంతో హిట్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్​లో శుక్రవారం(సెప్టెంబర్​-03న) రోజున.. పార్టిసిపెంట్స్​గా ఒకప్పటి లెజండరీ క్రికెటర్లు గంగూలీ, సెహ్వాగ్​ పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో... వీక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా.. కేబీసీ ఫ్యాన్స్​ మిస్సవకుండా ప్రోగ్రాం చూశారు. బిగ్​బీని హాట్​ సీట్లో కూర్చోబెట్టి.. దాదా వ్యాఖ్యాతగా వ్యవహరించటం నవ్వులు పూయించింది.

కేబీసీలో కేటీఆర్​ ట్వీట్​...

ఇదంతా ఒకెత్తయితే... ఇదే ఎపిసోడ్​లో అనూహ్యంగా ఓ ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంతో సరదాగా.. ఆసక్తికరంగా సాగుతున్న ఆటలో.. కంప్యూటర్​ స్క్రీన్​పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్​కు సంబంధించిన ప్రశ్న దర్శనమిచ్చింది. కరోనా సమయంలో వస్తున్న మందుల విచిత్ర పేర్ల విషయంలో మంత్రి కేటీఆర్​.. అప్పట్లో చేసిన ట్వీట్​కు సంబంధించిందే ఆ ప్రశ్న. మంత్రి కేటీఆర్​.. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్​కు మధ్య జరిగిన సరదా సంభాషణను గుర్తుచేసింది.

ఆ రోజు సరదాగా చేసిన ట్వీట్​..

కరోనా వైద్యంలో భాగంగా వాడుతున్న మందులు, మాత్రల పేర్లను తన ట్విట్టర్​ వేదికగా మే 20, 2021న ప్రస్తావించిన కేటీఆర్.. పలికేందుకు కష్టంగా ఉన్న పేర్లు ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా? అని సరదాగా ప్రశ్నించారు.

అసలు ప్రశ్న ఇదే..

అదే ట్వీట్​ను ఆధారంగా చేసుకుని.. ఆ ట్వీట్​లో మంత్రి కేటీఆర్​ ఎవరిని ట్యాగ్​ చేశారన్న దాన్ని ప్రశ్నగా దాదా, సెహ్వాగ్​లపై సంధించారు అమితాబ్​. నలభై వేల విలువ గల ఈ ప్రశ్నకు... ట్విట్టర్​లో యాక్టివ్​గా ఉండే ఈ ఇద్దరు లెజండరీలు కాసేపు ఆలోచించారు. మొత్తానికి సరైన సమాధానం చెప్పేశారనుకోండి. ఈ ప్రశ్నకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్​కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్​ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

సరదాగా సాగిన ట్వీట్​ సంభాషణ...

మంత్రి కేటీఆర్​ చేసిన ఈ సరదా ట్వీట్​ తర్వాత కొద్దిసేపటికే.. తాను అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పక్కాగా సమాధానం చెప్పాలని ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్​పై శశిథరూర్.. మరుసటి రోజు స్పందించారు. శశి థరూర్ ఏకంగా 29 అక్షరాలతో ఉన్న ఓ పదాన్ని ట్వీట్​ చేశారు. మందులకు ఆ పేర్లు ఎలా పెడతారనే దానిపై తనదైనశైలిలో స్పందిస్తూ.. తనైతే.. కరోనిల్, కరోజీరో, ఆఖరికి 'గో కరోనా గో' వంటి పేర్లు పెడతానన్నారు. దానిపై స్పందించిన కేటీఆర్​.. ఈ పేర్ల అర్థాలు తెలుసుకునేందుకు నిఘంటువు తెరవాల్సి వచ్చిందని.. 'కరోనిల్​' పేరు మాత్రం బాగుందని సమాధానమిచ్చారు.

  • Not guilty! How can you indulge in such floccinaucinihilipilification, @KTRTRS? Left to me I'd happily call them "CoroNil", "CoroZero", & even "GoCoroNaGo!" But these pharmacists are more procrustean.... https://t.co/YrIFSoVquo

    — Shashi Tharoor (@ShashiTharoor) May 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.