ETV Bharat / city

Minister KTR on Old City Development: 'వివక్ష లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధే సర్కారు లక్ష్యం'

author img

By

Published : Oct 4, 2021, 6:51 PM IST

Updated : Oct 4, 2021, 7:50 PM IST

MINISTER KTR TALK ABOUT OLD CITY DEVELOPMENT IN ASSEMBLY SESSIONS 2021
MINISTER KTR TALK ABOUT OLD CITY DEVELOPMENT IN ASSEMBLY SESSIONS 2021

హైదరాబాద్​ పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్​ (Minister KTR on Old City Development) అసెంబ్లీలో మాట్లాడారు. కాంగ్రెస్‌ కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం (telangana government) కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలో పాతబస్తీకి మెట్రో (metro) వస్తుందని తెలిపారు.

Minister KTR on Old City Development: 'వివక్ష లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధే సర్కారు లక్ష్యం'

ఎలాంటి వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్​ ( cm kcr) లక్ష్యమని మంత్రి కేటీఆర్​ (minister ktr) అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. పాతబస్తీకి ఏడేళ్లలో పురపాలక, ఇతర శాఖల ద్వారా రూ.14,887 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 2004-14 మధ్య కాంగ్రెస్‌ రూ.3,934 కోట్లే ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఏ కార్యక్రమం తీసుకున్నా... పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా... ఏ వివక్ష చూపెట్టకుండా... అమలు చేశాం. ఒక చిన్న ఉదహరణ.. 2018 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్​ ఒక హామీ ఇచ్చారు. మా అభ్యర్థిని గెలిపించండి... ములుగును జిల్లా కేంద్రంగా చేస్తామన్నారు. కానీ అక్కడి ప్రజలు వేరే తీర్పును ఇచ్చారు. కానీ కొంత సమయంలోనే ములుగును జిల్లాగా ప్రకటించారు. ఏ వివక్ష లేకుండా... అభివృద్ధిని చేస్తున్నాం.

- కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

వంద కోట్లైనా ఖర్చు చేస్తాం..

స్వాతంత్య్రం వచ్చాక పాతబస్తీలో ఇంత పెద్దఎత్తున రోడ్ల అభివృద్ధి ఎప్పుడూ జరగలేదన్నారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టుకు మరో వంద కోట్లైనా ఇస్తామని తెలిపారు. అభివృద్ధిలో పాత, కొత్త నగరాలన్న తేడా లేదన్నారు. రాజాసింగ్‌ చెబుతున్నట్లు ప్రభుత్వం ఎక్కడా వివక్ష చూపడం లేదని తెలిపారు. సెవెన్‌ టూంబ్స్, గోల్కొండకు ప్రపంచ వారసత్వ హోదాకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. మీర్‌ఆలం చెరువును దుర్గం చెరువులా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. పాతబస్తీకి కచ్చితంగా మెట్రో రైలు వస్తుందని ప్రకటించారు. కరోనా వల్ల పాతబస్తీకి మెట్రో రైలు కొంత ఆలస్యమైందని వివరించారు.

ఒకేసారి శంకుస్థాపన

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కోసం నిధులిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. సచివాలయంలో మసీదు, గుడి, చర్చి నిర్మిస్తామన్నారు. సచివాలయంలో మసీదు, గుడి, చర్చికి ఒకేసారి శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు.

పాతబస్తీకి కచ్చితంగా మెట్రో రైలు వస్తుంది. కరోనా వల్ల మెట్రో కొంత ఆలస్యమైంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కోసం నిధులిస్తాం. సచివాలయంలో మసీదు, గుడి, చర్చి నిర్మిస్తాం. సచివాలయంలో మసీదు, గుడి, చర్చికి ఒకేసారి శంకుస్థాపన చేస్తాం.

- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

ఇవీచూడండి:

Last Updated :Oct 4, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.